|
ఉత్తేజ్, కార్తీక్, గణేష్ |
గత వారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మనూరి విద్యార్థులందరూ ఉత్తమ శ్రేణిలో మెరిశారు. ఈ సంవత్సరం మండవ ఉత్తేజ్, పొడపాటి కార్తీక్, పొడపాటి గణేష్, పొడపాటి అస్మిత, ప్రవీణ్ లు టెన్త్ ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. వీరిలో ఉత్తేజ్ 9.5 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. మిగిలిన వారికి కూడా మంచి మార్కులే వచ్చాయి. వీరందరికీ మనగుడిమెళ్లపాడు.కామ్ తరఫున శుభాభినందనలు. మరో విషయం ఏంటంటే వీరందరూ ఇంటర్మీడియెట్ విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో చేరుతున్నారు. వారి భవిష్యత్తు బంగారం కావాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాం......
- అశోక్ పొడపాటి
ఫొటో కర్టెసీ: చక్రి
తేదీ: 23-5-2014