నిర్మాణంలో ఉన్న గంగమ్మ తల్లి ఆలయ చిత్రాలు
అంకమ్మ తల్లి ఆలయానికి సింగయ్య, అనసూయమ్మ దంపతులు శంకుస్థాపన చేస్తున్న చిత్రం
మనూర్లో రెండు ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అందులో ఒకటి పెద్ద పొడపాటి వారి ఇలవేల్పు గంగమ్మతల్లి ఆలయం కాగా.. రెండోది కారుమూడి వారి ఇలవేల్పు అంకమ్మతల్లి ఆలయం.
గంగమ్మ ఆలయాన్ని గతంలోనే ఒకసారి నిర్మించారు. ఇప్పుడు దాని స్థానంలో నూతన ఆలయాన్ని మరిన్ని హంగులతో నిర్మిస్తున్నారు. ఈ సారి అక్కడ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దాని కోసం అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. పొడపాటి సాంబయ్య, పొడపాటి రమేష్, పొడపాటి సీతారామయ్యలు ప్రధాన దాతలు. ఇంకా ఆ ఇళ్లలో ఉన్నతోద్యోగాల్లో ఉన్న వారు కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. శ్రావణమాసం(ఆగస్టు) నాటికి నిర్మాణం పూర్తిచేసి, అమ్మవారిని ప్రతిష్ఠించాలని నిర్వాహకుల సంకల్పం. ఏ ఆటంకాలు లేకుండా నెరవేరాలని కోరుకుందాం.
అలాగే అంకమ్మ ఆలయ నిర్మాణం కూడా కారుమూడి సింగయ్య ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. ఇక్కడా ముందు ఆలయం ఉన్నా... అది శిథిలమయడంతో నూతన నిర్మాణానికి పూనుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో అంతా సవ్యంగా జరగాలని కోరుకుంటున్నాం.
అశోక్ పొడపాటి
తేదీ: 17-06-2012